తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొడవలి తగిలి స్కూటీపై వెళ్తున్న విద్యార్థిని మృతి

కర్ణాటకలోని కల​బురగి జిల్లాలో బైక్​పై వెళ్తున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గొంతుకు ప్రమాదవశాత్తు కొడవలి తగిలి మృతిచెందింది. స్కూటీపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనానికి కట్టిన కొడవలి ఆమె గొంతుకు తగిలింది.

By

Published : Apr 13, 2019, 4:31 PM IST

Updated : Apr 13, 2019, 4:41 PM IST

యాక్సిడెంట్

కర్ణాటకలోని కల​బురగిలో స్కూటీపై వెళ్తున్న ఓ విద్యార్థిని గొంతుకు ప్రమాదవశాత్తు కొడవలి తగిలింది. తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కరుణేశ్వర కాలనీకి చెందిన మేఘ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని నాగనహళ్లికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనానికి కట్టిన కొడవలి ఆమె గొంతును తీవ్రంగా గాయపరిచింది.

ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు... రక్తపు మడుగులో పడివున్న మేఘను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మేఘ మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

ఘటనకు కారణమైన వ్యక్తి... కొడవలిని, వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఇదీ చూడండి: 'జలియన్​వాలా' అమరులకు ఘన నివాళులు

Last Updated : Apr 13, 2019, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details