తెలంగాణ

telangana

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

By

Published : Nov 15, 2019, 6:14 PM IST

Updated : Nov 15, 2019, 6:57 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్ ఈడీ​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. చిదంబరంపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని.. ఈ నేరంలో ఆయనదే కీలక పాత్ర అని దిల్లీ హైకోర్టు పేర్కొంది.

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

చిదంబరానికి షాక్​- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్​ఎక్స్​ మీడియా ఈడీ కేసులో ఆయనకు బెయిల్​ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసులో చిదంబరానికి బెయిల్​ మంజూరు చేస్తే సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని జస్టిస్​ సురేశ్​ కైత్​ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువరించే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

"అవినీతి కేసులో సీబీఐ సమర్పించిన ఆధారాలతో పోలిస్తే... మనీలాండరింగ్​ కేసులో ఈడీ సంపాందించిన ఆధారాలు భిన్నమైనవి. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి.. నేరంలో ఆయనదే కీలక పాత్ర. ఇప్పుడు బెయిల్​ మంజూరు చేస్తే.. సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి." - దిల్లీ హైకోర్టు

ఈ కేసులో చిదంబరం, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం నవంబర్ 8న తీర్పు రిజర్వ్​ చేసిన దిల్లీ హైకోర్డు నేడు నిర్ణయం వెలువరించింది. మనీలాండరింగ్​ కేసులో అక్టోబర్ 16న చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్​ చేసింది. అయితే అక్టోబర్ 22న సీబీఐ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది.

Last Updated : Nov 15, 2019, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details