తెలంగాణ

telangana

టాయ్​లెట్​లో ఫోన్​ వాడుతున్నారా? మీకు పైల్స్​ వస్తాయ్​!

By

Published : Oct 6, 2019, 1:47 PM IST

మొబైల్​ను విడిచి క్షణమైనా ఉండలేని కొంతమంది వాటిని శౌచాలయాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ అలవాటు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

టాయ్​లెట్​లో ఫోన్​ వాడుతున్నారా? మీకు పైల్స్​ వస్తాయ్​!

మొబైల్​ ఫోన్ వాడకం ఈరోజుల్లో కొందరికి వ్యసనంలా తయారైంది. ఎక్కడికెళ్లినా చేతిలో ఫోన్​ ఆపరేట్ చేయడం అలవాటైంది. కొంత మంది శౌచాలయాలకు వెళ్లినా మొబైల్​ ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లకు పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలని.. సాధ్యమైనంత వరకు టాయ్​లెట్​లో ఫోన్ వాడొద్దని సలహా ఇస్తున్నారు.

"శౌచాలయంలో ఫోన్​ వాడితే సమయం వృథా కాదని కొంతమంది భావిస్తారు. అక్కడ ఎక్కువ సేపు మొబైల్ ఉపయోగించే వారికి మూలశంక లేదా మొలల సమస్య వచ్చే అవకాశం అధికం."
-దీపాంకర్ శంకర్​ మిత్ర, వైద్య నిపుణుడు, జేపీ హాస్పిటల్స్​, నొయిడా.

"స్మార్ట్ ఫోన్​ ఉపయోగించడం సమస్య కాదు. టాయ్​లెట్​లో ఎక్కువ సేపు వాడటం ప్రమాదకరం. రక్తస్రావం, నొప్పి, వాపు వంటి సమస్యలు పైల్స్​కు దారితీస్తాయి."
- నవీన్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు, నారాయణ సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రి, గురుగ్రామ్​

బ్రిటన్​లో 57 శాతం మంది

బ్రిటన్​లో 57 శాతం మంది ప్రజలు టాయ్​లెట్​లో ఫోన్ ఉపయోగిస్తున్నారని యూగోవ్​ సర్వేలో తేలింది. వారిలో 8 శాతం మంది ప్రతిరోజు శౌచాలయానికి ఫోన్ తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.

ఇదీ చూడండి: బ్యాంకులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్​ నిర్మాతగా..!

ABOUT THE AUTHOR

...view details