తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ భద్రతను జెడ్​ ప్లస్​ విభాగానికి మార్చింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధానికి ఇన్నేళ్లుగా ఉన్న ఎస్​పీజీ రక్షణను ఉపసంహరించుకుంది.

By

Published : Aug 26, 2019, 12:37 PM IST

Updated : Sep 28, 2019, 7:33 AM IST

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ రక్షణను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించింది. వివిధ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది.

"మన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రత కేటాయించాం. కాలానుగుణంగా తీసుకునే చర్యల్లో ఇదొక భాగం. వివిధ భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాం."
--- హోంశాఖ ప్రతినిధి.

ప్రత్యేక రక్షణ బృందం(ఎస్​పీజీ), వివిధ నిఘా సంస్థల నివేదికతో కేబినెట్​ సెక్రటేరియట్​, హోంశాఖ మూడు నెలల పాటు సమీక్షించిన అనంతరంమన్మోహన్​కు జెడ్​ ప్లస్​ భద్రతను కేటాయించింది. ఇందులో భాగంగా మాజీ ప్రధానికి సీఆర్​పీఎఫ్​ రక్షణ కల్పించే అవకాశముంది.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ నేతలు రాహుల్​, ప్రియాంక గాంధీకి మాత్రమే ఇప్పుడు ఎస్​పీజీ భద్రత ఉంది.

ఎస్​పీజీ 1988 చట్టం ప్రకారం మన్మోహన్​ ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఏడాది వరకు ఎస్​పీజీ భద్రతను కేటాయించాలి. కానీ మన్మోహన్​, అయన భార్య గురుశరన్​​ కౌర్​కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఎస్​పీజీ భద్రతను పొడిగించారు.

ఇదీ చూడండి:- తుపానుపై అణు బాంబు వేస్తే సరి: డొనాల్డ్​ ట్రంప్​

Last Updated : Sep 28, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details