తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దాడుల ఆధారాలు చూపండి'

బాలాకోట్​లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్​ సింగ్​.

By

Published : Mar 3, 2019, 6:52 AM IST

Updated : Mar 3, 2019, 8:18 AM IST

'దాడుల ఆధారాలు చూపండి'

జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై వాయుసేన చేసిన దాడులను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్. వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐఏఎఫ్​ పైలెట్​ను విడుదల చేసినందుకు పాకిస్థాన్​ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉగ్రసంస్థల అధినేతలైన మసూద్​ అజార్​, హఫీజ్​ సయ్యద్​లనూ భారత్​కు అప్పగించాలని పాకిస్థాన్​ను డిమాండ్​ చేశారు.

మాట్లాడుతున్న దిగ్విజయ్​ సింగ్​

" నేను దాడిని ప్రశ్నించడంలేదు. సాంకేతికత అందుబాటులో ఉంది.. అంతరిక్షం నుంచి శాటిలైట్​ ద్వారా ఫోటోలు తీసే వీలుంది. ఒసామా బిన్​ లాడెన్​ విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి ఆధారాలు చూపినట్లు మన ప్రభుత్వం కూడా అలాంటి ఆధారాలు చూపాలి."
-దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

Last Updated : Mar 3, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details