తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవా సంకీర్ణ రాజకీయంపై జీఎఫ్​పీ ఆందోళన

గోవా అధికార కూటమిపై ఆందోళన వ్యక్తం చేసింది భాగస్వామ్య గోవా ఫార్వర్డ్ పార్టీ​. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే కూటమి భాగస్వాముల మధ్య అనుమానాలు తలెత్తుతాయని పేర్కొంది. కూటమి భవిష్యత్తు ప్రణాళికపై ముఖ్యమంత్రి స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేసింది.

By

Published : Mar 27, 2019, 7:59 PM IST

గోవా సంకీర్ణ రాజకీయంపై జీఎఫ్​పీ ఆందోళన

గోవా అధికార కూటమిలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది భాగస్వామ్య గోవా ఫార్వర్డ్​ పార్టీ. ఎంజీపీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి ఫిరాయింపులతో కూటమి భాగస్వాముల మధ్య అనుమానాలు రేకెత్తుతాయని పేర్కొంది. ప్రస్తుతం జీఎఫ్​పీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతుగా ఉంది.

"ఫిరాయింపులు ఇలానే కొనసాగితే కూటమిపై నమ్మకం కోల్పోతాం. భాగస్వామ్య పార్టీల మధ్య అనుమానాలు రేకెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తుంది." - విజయ్​ సర్దేశాయ్, జీఎఫ్​పీ అధ్యక్షుడు ​

ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి కూటమి ఏర్పాటుపై అన్ని విషయాలు తెలుసునన్నారు సర్దేశాయ్​​. భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టతనిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు భాజపా రాష్ట్ర నాయకత్వానికి తమ అభ్యంతరాలను తెలిపినట్లు వివరించారు.

ఏప్రిల్​ 23న జరగనున్న శిరోడా అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఎంజీపీ మాజీ ఎమ్మెల్యే పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం వల్ల ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని సర్దేశాయ్​ తెలిపారు. శిరోడా సమస్య పరిష్కారం కాకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details