తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ... మీ సమావేశం దండగ... నేను రాను'

నీతి ఆయోగ్​పై విమర్శలు గుప్పించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపే అధికారం లేని సంస్థ సమావేశానికి హాజరవటం దండగ అని పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహిస్తున్న సమావేశానికి రాలేనని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు దీదీ.

By

Published : Jun 7, 2019, 5:17 PM IST

'మోదీ... మీ సమావేశం దండగ... నేను రాను'

ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్​పై తీవ్ర విమర్శలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపే అధికారం లేని నీతి ఆయోగ్​ సమావేశానికి రావటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

ఈ నెల 15న నిర్వహించే సమావేశానికి తాను హాజరుకాలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు దీదీ.

"నీతి ఆయోగ్​కు ఎలాంటి ఆర్థికపరమైన, రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపే అధికారాలు లేవనేది వాస్తవం. ఎలాంటి ఆర్థికపరమైన అధికారాలు లేని సంస్థ సమావేశానికి హాజరవటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు అంతర్ రాష్ట్రాల మండలి-ఐఎస్​సీపై దృష్టి పెట్టాలని సూచించారు మమత. జాతీయ అభివృద్ధి మండలిని... ఐఎస్​సీ కిందకు తీసుకురావాలని పేర్కొన్నారు మమత.

గతంలో నిర్వహించిన నీతి ఆయోగ్​ సమావేశాలకూ గైర్హాజరయ్యారు దీదీ. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి కొత్త సంస్థ ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం తరఫున బంగాల్​ ఆర్థిక మంత్రి అమిత్​ మిశ్రాను సమావేశాలకు పంపారు.

15న సమావేశం..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 15న నీతి ఆయోగ్​ ఐదో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో దేశాభివృద్ధి దోహదపడే పలు అంశాలపై చర్చించనున్నారు.

ఇదీ చూడండి:10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య

ABOUT THE AUTHOR

...view details