దిల్లీ-ఘజీపుర్ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న నిరసన దీక్షకు తన వంతు మద్దతు తెలిపాడు నాలుగేళ్ల చిన్నారి రేహాన్. రేయి పగలు అని తేడా తెలియక రైతులు చేస్తోన్న ఆందోళనకు బాసటగా నిలిచాడు. తన వంతు సాయంగా వారికి బిస్కెట్లు, అరటి పండ్లు అందించాడు. బుడతడు చిట్టి చిట్టి చేతులతో ఆహారం అందించడం చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోయారు.
"రైతులు నిరసన తెలిపే ఈ ప్రదేశానికి నేను రోజూ వస్తుంటాను. పదిరోజులుగా మా వంతు సాయంగా వారికి చిరు తిండ్లు అందిస్తున్నాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. మాది బిహార్లోని వ్యవసాయ కుటుంబమే. నా సంపాదన 20 వేలు. అందులో నుంచి కొంతభాగం వారి కోసం ఖర్చు చేయడంలో ఆనందం ఉంది. నా కుమారుడు కూడా ఇందులో భాగం అయ్యాడు."
-మెహతాబ్ ఆలం, రేహాన్ తండ్రి