తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ ​జైట్లీ అస్తమయం

భారతీయ జనతా పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ ఇకలేరు. కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం 12:07 గంటలకు దిల్లీ ఎయిమ్స్​లో తుదిశ్వాస విడిచారు.

By

Published : Aug 24, 2019, 12:58 PM IST

Updated : Sep 28, 2019, 2:36 AM IST

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ ​జైట్లీ అస్తమయం

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ ​జైట్లీ అస్తమయం

భాజపా కీలక నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ (66) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం 12:07 గంటలకు దిల్లీ ఎయిమ్స్​లో కన్నుమూశారు.

క్యాన్సర్​తో పోరాటం...

గతేడాది కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు జైట్లీ. ఆయనకు మృదుకణజాల క్యాన్సర్​ ఉన్నట్లు ఈ ఏడాది ఆరంభంలో వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం నెల రోజులు అమెరికా వెళ్లి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

గుండె, మూత్రపిండ సమస్యలతో ఆగస్టు 9న మరోమారు తీవ్ర అస్వస్థతకు గురై, దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

చెరగని ముద్ర...

భాజపాలోని కొద్ది మంది శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా పేరు సంపాదించారు జైట్లీ. వాజ్​పేయీ, నరేంద్రమోదీ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ హయాంలో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

జీవితం...

1952 డిసెంబర్​ 28న దిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి.. మహారాజ్​ కిషన్​ జైట్లీ ప్రముఖ న్యాయవాది.

  • అరుణ్​ జైట్లీ దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు. బీకామ్​ హానర్స్​లో డిగ్రీ, న్యాయ శాస్త్ర పట్టా పొందారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేశారు.
  • వాజ్​పేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
  • వాజ్​పేయీ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం న్యాయశాఖ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలు అందించారు.
  • 2009-14 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
  • 2014 సార్వత్రిక ఎన్నికలలో అమృత్​సర్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు జైట్లీ. కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఈయనపై విజయం సాధించారు.
  • మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక, రక్షణ, కార్పొరేట్​ వ్యవహారాలు, వాణిజ్యం పరిశ్రమలు శాఖ, న్యాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు.

గత ప్రభుత్వంలో మోదీ కేబినెట్​లో జైట్లీ కీలకమైన వ్యక్తి. ఎన్డీఏ ప్రభుత్వంలో ట్రబుల్​ షూటర్​గా పేరు తెచ్చుకున్నారు. విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వటంలో జైట్లీ దిట్ట. భారతీయ జనతా పార్టీలో ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరు. మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో జైట్లీది ప్రధాన పాత్ర. వస్తు, సేవల పన్ను, ముమ్మారు తలాక్​ నిషేధంలో కీలకంగా వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.

ఇదీ చూడండి:జైట్లీ మార్క్​ రాజకీయం... విద్యార్థి దశ నుంచే...

Last Updated : Sep 28, 2019, 2:36 AM IST

ABOUT THE AUTHOR

...view details