తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2019, 5:03 PM IST

Updated : Apr 11, 2019, 6:44 PM IST

ETV Bharat / bharat

రాహుల్​పై 'పచ్చ లైటు'- కాంగ్రెస్​ కలవరం

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమేఠీ లోక్​సభ స్థానానికి నామినేషన్ వేశాక రాహుల్​ ముఖంపై పాయింట్​ బ్లాంక్​లో లేజర్లు పడ్డాయంటూ కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. భద్రత పెంచాలని కోరారు.

'రాహుల్​ ప్రాణాలకు ముప్పు.. భద్రత పెంచండి'

రాహుల్​పై 'పచ్చ లైటు'- కాంగ్రెస్​ కలవరం

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సదరు లేఖలో పేర్కొంది.

"ఇద్దరు ప్రధానులను దేశం తీవ్రవాదుల దాడి వల్ల కోల్పోయింది. ఆ ఇద్దరు గాంధీ కుటుంబానికి చెందినవారే. ప్రస్తుత కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపైనా అలాంటి దాడి జరుగుతుందనే అనుమానం ఉంది. అమేఠీ లోక్​సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశాక రాహుల్ విలేకరులతో మాట్లాడారు.

ఆ సమయంలో స్వల్ప వ్యవధిలో ఆయన ముఖం కుడి భాగంపై 7 సార్లు లేజర్ వెలుగు పడినట్లు గుర్తించాం. మాజీ భద్రతా నిపుణులు, అధికారులను సంప్రదించాక ఆ లేజర్​ ఓ శక్తిమంతమైన స్నైపర్​ తుపాకీ లాంటి ఆయుధం నుంచి వచ్చినట్లు ప్రాథమిక నిర్ధరణకొచ్చాం. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. దీనిపై హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం."

- కాంగ్రెస్ లేఖ సారాంశం

ఈ మేరకు కాంగ్రెస్​ నాయకులు అహ్మద్​ పటేల్, జైరాం రమేశ్, రణ్​దీప్​ సుర్జేవాలా సంతకాలతో హాంమంత్రిత్వ శాఖకు లేఖ అందించింది కాంగ్రెస్.

అది కెమెరా వెలుగు...!

ఈ విషయంపై హోంమత్రిత్వ శాఖకు ప్రత్యేక భద్రత దళం-ఎస్​పీజీ డైరెక్టర్​ సమాచారమిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ పేర్కొంటున్న వీడియోలోని 'గ్రీన్​ లైట్' ఏఐసీసీ ఫొటోగ్రాఫర్​ చరవాణి నుంచి వచ్చిందని తెలియజేశారు. అమేఠీ కలెక్టరేట్​ వద్ద రాహుల్​ గాంధీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగిందని వివరించారు. రాహుల్​ గాంధీ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు ప్రత్యేక భద్రత దళం డైరక్టర్​.

ఇదీ చూడండి: విజయం కోసం కాంగ్రెస్​ అడ్డదారులు: మోదీ

Last Updated : Apr 11, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details