తెలంగాణ

telangana

శివసేన కార్యకర్తపై కాల్పులు.. దుండగుడి అరెస్టు

By

Published : Dec 19, 2019, 11:32 AM IST

ముంబయిలో గురువారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. శివసేన కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దుండగుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Firing on Shiv Sena functionary in Mumbai; assailant nabbed
ముంబయిలో కాల్పుల కలకలం

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శివసేన కార్యకర్త చంద్రశేఖర్‌ జాదవ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఉదయం 7.15 గంటల ప్రాంతంలో విఖ్రోలిలోని ఠాగూర్ నగర్ ప్రాంతంలోని సాయిబాబా ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది.

ఆలయ పరిసరాల్లో తన కుమారుడితో జాదవ్​ కూర్చున్న సమయంలో ఆయనపై కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రౌండ్లు కాల్పులు చేపట్టిగా.. శేఖర్‌జాదవ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అదిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

శివసేన కార్యకర్తపై కాల్పులు

నిందితుడిది ఉత్తర్​ప్రదేశ్​లోని అలహాబాద్​గా గుర్తించారు పోలీసులు. స్థానికుల దాడిలో గాయపడిన నిందితుడిని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ ​ అయిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అవగాహన లేక 'పౌర' చట్టంపై విపక్షాల నిరసనలు

ABOUT THE AUTHOR

...view details