తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2019, 6:29 PM IST

Updated : Apr 18, 2019, 6:59 AM IST

ETV Bharat / bharat

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

సమరం రెండో విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాల్లోని 95 నియోజకవర్గాలకు ఓటింగ్ గురువారం జరగనుంది.

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 95 స్థానాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. మొత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు 1629 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది.

భారీ భద్రత....

పోలింగ్​ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రాల పోలీసులతో పాటు పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

తమిళనాట లోక్​సభతో పాటు శాసనసభకూ..

తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్​సభ స్థానాలకు గానూ 38 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. వెల్లూరు నియోజకవర్గానికి పోలింగ్ రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. వీటితో పాటు 18 శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికల పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి : ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

కర్ణాటకలో 14....

28 లోక్​సభ నియోజకవర్గాలున్న కర్ణాటకలో 14 స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ఇవి ఎక్కువగా పాత మైసూరు ప్రాంతంలో ఉన్నవి. ఇక్కడ జేడీఎస్​కు మంచి పట్టుంది.

మండ్య నుంచి ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్​ గౌడ, సినీ నటి సుమలత ఇక్కడ పోటీ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్​ నుంచి సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మిగతా రాష్ట్రాలు...

ఉత్తరప్రదేశ్​లో 8, బంగాల్​లో 3, బిహార్​లో 5, అసోంలో 5 స్థానాలకు పోలింగ్​ జరగనుంది.

రెండో విడత పోలింగ్​
Last Updated : Apr 18, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details