తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 9:17 AM IST

ETV Bharat / bharat

దిల్లీలో మెట్రో సేవలు పునఃప్రారంభం

దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తిరిగి తెరుచుకున్నాయని.. సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని డీఎంఆర్​సీ అధికారులు ప్రకటించారు. పౌర చట్టానికి వ్యతిరేకంగా నిన్న దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అన్ని సేవలను నిలిపివేశారు అధికారులు.

Entry, exit gates of all metro stations opened
దిల్లీలో మెట్రో సేవలు పునఃప్రారంభం

దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో సేవలు పునః ప్రారంభమైనట్లు డీఎంఆర్​​సీ అధికారులు తెలిపారు. పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఆదివారం మెట్రో సేవలను నిలిపివేశారు.

డీఎంఆర్​సీ అధికారులు ట్వీట్​.

"దిల్లీలోని అన్ని మెట్రోస్టేషన్లలో భద్రత పరమైన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, సాధారణ సేవలు పునఃప్రారంభమయ్యాయి."
-డీఎంఆర్​సీ అధికారులు ట్వీట్​.

ఆదివారం నాడు ఆగ్నేయ దిల్లీలో పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని 13 మెట్రో స్టేషన్లను మూసివేశారు దిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్​ అధికారులు.

ఇదీ చూడండి:'దిల్లీ హింసపై మోదీ నోరు మెదపకపోవడం దారుణం'

ABOUT THE AUTHOR

...view details