తెలంగాణ

telangana

'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

By

Published : Apr 3, 2020, 9:14 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగటానికి కారణమైన తబ్లిగ్-ఎ-జమాత్​ సంస్థ అధిపతి మౌలానా సాద్​పై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర లావాదేవీలను పరిశీలిస్తోంది. తగిన సాక్ష్యాలు దొరికిన మరుక్షణమే చర్యలు చేపట్టాలని భావిస్తోంది.

Enquiry On Tablig Jamat Chief Arun
తబ్లిగ్​ ఈ జమాత్​ సంస్థపై దర్యాప్తుకు సిద్ధమైన ఆదాయ శాఖ

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, దిల్లీ నిజాముద్దీన్​లో ప్రార్థనలు నిర్వహించిన 'తబ్లీగ్​-ఎ-జమాత్' సంస్థ అధిపతి మౌలానా సాద్​పై ఆదాయ పన్నుశాఖ సహా అన్ని రకాల దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.

ఇప్పటి వరకు దిల్లీ పోలీసులు కరోనా వైరస్​ వ్యాప్తికి కారణమైన... నిజాముద్దీన్ వ్యవహారంపైనే విచారణ చేపట్టారు. కానీ ఇప్పుడు తబ్లీగ్​ ఈ జమాత్ సంస్థ అధిపతిపై దృష్టి కేంద్రీకరించారు. ఆయన ఆదాయ వనరులు, కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నారు.

విలాస పురుషులా?

తబ్లీగీ జమాత్ సంస్థ అధిపతి మౌలానా సాద్​కు షామ్లిలో అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్​తో పాటు ఖరీదైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. మౌలానా సాద్​కు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

కుటుంబమంతా

మౌలానా సాద్​ ముగ్గురు కుమారులు మార్కాజ్​, నిజాముద్దీన్, షరీఫ్​... దర్గా కార్యనిర్వాహక కమిటీలో ముఖ్య సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరికి సంబంధించిన కోట్ల రూపాయల ఆదాయం, ఖర్చుల సమాచారాన్ని కూడా దర్యాప్తు సంస్థలు పరీశీలీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ వరకు ఉన్న అన్ని ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలపై అనధికారిక దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు అధికారులు. తగిన సాక్ష్యాలు, పత్రాల ధ్రువీకరణ అయిన మరుక్షణం చర్యలు తీసుకునేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ విషయాలపై లోతుగా విచారణ జరిపేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details