తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​ : ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. షోపియాన్​ జిల్లాలో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.

By

Published : Mar 28, 2019, 8:55 AM IST

Updated : Mar 28, 2019, 12:21 PM IST

ఎన్​కౌంటర్​

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​
జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

షోపియాన్​ జిల్లా కెల్లెర్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. సైన్యం, సీఆర్​పీఎఫ్​, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి.ముష్కరులు ఉన్న ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.

భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వారి నుంచి భద్రతా సిబ్బంది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

హంద్వారాలో మరో ఎన్​కౌంటర్​

హంద్వారాలోని యారో లంగేట్​ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో వారిపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులకు దీటుగా సమాధానమిస్తున్నారు జవాన్లు.

కాల్పులు ఇంకా కొనసాగుతున్న కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు ముసేయించారు అధికారులు. స్థానికంగా చరవాణీ అంతర్జాల సేవలు నిలిపేశారు.

Last Updated : Mar 28, 2019, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details