తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ అదుపులో మధ్యప్రదేశ్ సీఎం మేనల్లుడు

అగస్టా వెస్ట్​లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో రతుల్​ పురీని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ అధికారులు అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు రతుల్.

By

Published : Sep 4, 2019, 9:38 PM IST

Updated : Sep 29, 2019, 11:22 AM IST

ఈడీ అదుపులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మేనల్లుడు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు రతుల్​ పురీని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ అధికారులు అరెస్ట్ చేశారు. అగస్టా వెస్ట్​లాండ్​ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రతుల్​ను అదుపులోకి తీసుకుని దిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం రతుల్​కు ఒక్కరోజు రిమాండ్​ విధించింది. కస్టడీకీ అప్పగింతపై ఈడీ వాదనలను రేపు విననుంది.

బ్యాంకు మోసానికి సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు రతుల్.

ఇటలీకి చెందిన ఫిన్మెక్కానికా బ్రిటిష్ అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్​లాండ్​ నుంచి 12 వీవీఐపీ ఛాపర్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మనీలాండరింగ్ కేసు నమోదైంది.

ఇదీ చూడండి: భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు

Last Updated : Sep 29, 2019, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details