తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ప్రసంగంపై నివేదిక కోరిన ఈసీ

మహారాష్ట్రలోని వార్ధా ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. వార్ధాలో మోదీ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్.

By

Published : Apr 6, 2019, 8:55 AM IST

Updated : Apr 6, 2019, 10:32 AM IST

ప్రధాని 'వార్ధా ప్రసంగం' పై నివేదిక కోరిన ఈసీ

మోదీ ప్రసంగంపై నివేదిక కోరిన ఈసీ

మహారాష్ట్ర వార్ధాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై భారత ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది.

భాజపా ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో తమ నాయకులను పోటీలో నిలబెట్టడానికి ప్రతిపక్షాలు భయపడతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్​. ప్రధాని వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ప్రజల్లో విభజనకు దారితీసేలా ఉన్నాయని ఆరోపించింది.

కాంగ్రెస్​ నాయకులు అహ్మద్​ పటేల్​, జైరాం రమేశ్​, అభిశేక్​ మను సింఘ్వీ, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా ఈసీకి ఐదు ఫిర్యాదులు అందించారు. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక మోదీ కోడ్​ ఉల్లంఘించటం ఇది నాలుగోసారని పేర్కొన్నారు.

ఎన్నికల అఫిడవిట్​లో ఆస్తుల వివరాలు సరిగ్గా వెల్లడించని భాజపా అధ్యక్షుడు అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా షాను అనర్హుడిగా గుర్తించాలన్నారు.

అరుణాచల్​ప్రదేశ్​లో ఓట్ల కోసం డబ్బుల పంపిణీకి కుట్ర, గిరిజన ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్​ కుట్రలపై ఫిర్యాదు చేశారు. ముంబయి జాయింట్​ పోలీసు కమిషనర్​ దేవెన్​ భారతిని బదిలీ చేయాలని డిమాండ్​ చేశారు.

Last Updated : Apr 6, 2019, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details