తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​గాంధీకి ఈసీ 'షోకాజ్​' నోటీసులు

కాంగ్రెస్​ అధినేత రాహుల్​గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా స్పందించాలని ఆదేశించింది.

By

Published : May 2, 2019, 7:31 AM IST

రాహుల్​గాంధీకి ఈసీ 'షోకాజ్​' నోటీసులు

రాహుల్​గాంధీకి ఈసీ 'షోకాజ్​' నోటీసులు

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి ఎన్నికల సంఘం సంజాయిషీ​ నోటీసులు జారీ చేసింది. గిరిజనులను కాల్చి చంపేలా మోదీ ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని రూపొందిస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 గంటల్లోగా​ నోటీసులపై కాంగ్రెస్​ అధ్యక్షుడు స్పందించాలని కోరింది. అలా జరగని పక్షంలో రాహుల్​కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తదుపరి కార్యచరణలుంటాయని ఈసీ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details