తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో అత్యధికం.. జమ్ముకశ్మీర్​లో అత్యల్పం

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 64 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా బంగాల్​లో 76.66 శాతం, జమ్ముకశ్మీర్​లోని అనంత్​నాగ్​లో అత్యల్పంగా 10.5 శాతం ఓట్లే పోలయ్యాయి.

By

Published : Apr 29, 2019, 5:04 PM IST

Updated : Apr 30, 2019, 7:43 AM IST

భారత్​ భేరి: 'సార్వత్రికం' 4వ దశ సమాప్తం

సార్వత్రికం నాలుగో దశ సమాప్తం

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్​లో 9 రాష్ట్రాల్లోని 72 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరిగింది. మొత్తం 64శాతం పోలింగ్​ నమోదైంది. బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బంగాల్​లో అత్యధికంగా 76.66 శాతం పోలింగ్​ నమోదైంది. జమ్ముకశ్మీర్​లోని అనంత్​నాగ్​లో 10.5 శాతం ఓట్లే పోలయ్యాయి. 943 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఓటెత్తిన భారతావని...

పోలింగ్ కేంద్రాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మహారాష్ట్రలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

ఘర్షణలు...

బంగాల్​ అసాన్​సోల్​లో తమ పోలింగ్ బూత్ ఏజెంట్​కు లంచం ఇవ్వజూపారన్న కారణంతో తృణమూల్ కార్యకర్తలు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోతో గొడవకు దిగారు. ఆయన కారును ధ్వంసం చేశారు. మరో చోట భద్రత కోసం కేంద్ర బలగాల్ని వినియోగిస్తున్నారన్న కారణంతో ఓటేయడానికి నిరాకరించారు స్థానికులు.

ఒడిశాలో పోలింగ్ ఏజెంట్​గా విధుల్లో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఒడిశా మహంగా అసెంబ్లీ సెగ్మెంట్​లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఎన్నికను బహిష్కరించారు.

ప్రముఖుల ఓటు...

ఎన్సీపీ అధినేత శరద్​పవార్, కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్, కన్నయ్యకుమార్ నాలుగో దఫా ఎన్నికల్లో ఓటు వేశారు.

తారలు, పారిశ్రామికవేత్తలు ఉదయమే...

ముంబయిలోని సినీ తారలు, పారిశ్రామికవేత్తలు ఉదయమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, సోదరుడు అనిల్ అంబానీ, మహీంద్ర గ్రూప్​ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిజర్వు బ్యాంకు ఛైర్మన్ శక్తికాంతాదాస్ ఓటు వేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 30, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details