తెలంగాణ

telangana

'శునకా'నందాన్ని పొందిన యువకులు.!

By

Published : Jun 7, 2020, 1:27 PM IST

శునకం అంటే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు చాలామంది. మరికొందరైతే తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. దానికి సకల సౌకర్యాలు కల్పిస్తుంటారు. కానీ.. మహారాష్ట్రలో కొందరు ఓ శునకాన్ని చిత్రహింసలు పెట్టారు. తమ సరదా కోసం.. కుక్కను బైక్​కు కట్టేసి కిలోమీటర్​ పాటు ఈడ్చుకెళ్లారు.

Dog dragged for 1 kilometwer in Aurngabad by two man FIR  registered
శునకానందాన్ని పొందిన యువకులు.!

మహారాష్ట్రలో అమానవీయ ఘటన జరిగింది. ఔరంగాబాద్‌లో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు శునకం మెడకు చైన్‌ కట్టి దానిని సుమారు కిలోమీటర్‌ వరకూ లాక్కెళ్లారు. శునకం వదిలించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ద్విచక్రవాహనం వెనక వచ్చిన వారు ఈ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

'శునకా'నందాన్ని పొందిన యువకులు.!

సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి కొందరు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకాన్ని లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఇంట్లో దూరిన ఎగిరేపాము.. పట్టుకోలేక ఆపసోపాలు!

ABOUT THE AUTHOR

...view details