దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారండంపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ అధికారులతో, అమిత్ షా.. అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఇంటెలెజెన్స్ చీఫ్, దిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులతో చర్చించిన అనంతరం దిల్లీలో అదనపు బలగాలను మోహరించాలని అమిత్ షా.. సంబంధిత అధికారులను ఆదేశించారు.