తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో పొత్తులేదు : రాహుల్​

రానున్న లోక్​సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కూటమి సన్నాహాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ తెలిపారు. దిల్లీలో మాత్రం ఆప్​ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు.

By

Published : Mar 8, 2019, 7:34 AM IST

దిల్లీలో పొత్తులేదు : రాహుల్​

లోక్​సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు పొత్తులపై వ్యూహాలు రచిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు బరిలోకి దిగనున్నాయి. కేంద్రంలో ఈసారైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా కూటముల జోరు పెంచుతూ... ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. దిల్లీలో కాంగ్రెస్​ పార్టీ కూటమి విషయంపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత రాహుల్​గాంధీ. దేశవ్యాప్తంగా కూటమి సన్నాహాలు జరుగుతున్నాయని... దిల్లీలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్​ అధ్యక్షుడు తెలిపారు.

" రానున్న లోక్​సభ ఎన్నికలకు మహారాష్ట్ర, తమిళనాడు, ఝార్ఖండ్​ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీ కూటమి ఏర్పాటు చేసింది. దిల్లీలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని మా పార్టీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దేశ వ్యాప్తంగా కూటమి సన్నాహాలు కొనసాగుతున్నాయి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details