తెలంగాణ

telangana

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ-మోదీ హాజరు

By

Published : Oct 4, 2020, 7:47 PM IST

Published : Oct 4, 2020, 7:47 PM IST

Updated : Oct 5, 2020, 12:01 AM IST

BJP Central Election Committee (CEC) meeting.
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..

20:29 October 04

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..

బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మిగతా ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ అభ్యర్థుల ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అటు.. ఎన్డీఏ కూటమి నుంచి లోక్‌జనశక్తి పార్టీ వైదొలిగిన నేపథ్యంలో ఆ అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికల బరిలో నిలుస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది.

మూడు దశల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలివిడత పోలింగ్​ ఈ నెల 28న జరగనుంది. 

19:34 October 04

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ-మోదీ హాజరు

బిహార్​ ఎన్నికలకు ముందు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. భాజపా ప్రధాన కార్యాలయంలో జరుగతున్న సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, ఇతర సీనియర్​ నేతలు హాజరయ్యారు. 

Last Updated : Oct 5, 2020, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details