తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపాతో కాంగ్రెస్​ పోరాటం కొనసాగుతుంది'

కేరళలోని వయనాడ్​ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. అసత్యాలు, విద్వేషాలతోనే భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

By

Published : Jun 9, 2019, 5:37 AM IST

Updated : Jun 9, 2019, 6:32 AM IST

'అబద్ధాలు, విద్వేషాలతోనే అధికారంలోకి మోదీ'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారమంతా అబద్ధాలు, విద్వేషాల నడుమే సాగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ మాత్రం సత్యం, ప్రేమలతోనే ప్రచారం నిర్వహించిందని ఉద్ఘాటించారు.

మూడు రోజుల వయనాడ్​ పర్యటనలో భాగంగా కాల్పెట్ట, కంబాల్​క్కాడ్, పనామరమ్, మనంత్వాడీ పుల్పల్లి, సుల్తాన్ బతేరీ ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు రాహుల్.

కాంగ్రెస్​ అధ్యక్షుడి సభలకు పెద్ద సంఖ్యలో వయనాడ్​వాసులు హాజరయ్యారు.

వయనాడ్​ ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు రాహుల్.

వయనాడ్​ పర్యటనపై రాహుల్ ట్వీట్

ఇదీ చూడండి: 'ఉగ్రవాదానికి సహాయం.. మానవాళికి ప్రమాదం'

Last Updated : Jun 9, 2019, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details