కేరళ ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మృతిచెందారు. మరో 46 మంది ఆచూకీ తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే భారీగా కురుస్తోన్న వర్షాలు గాలింపు చర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయి.
రాష్ట్రమంత్రి ఎంఎం మణి ఘటనా స్థలానికి చేరుకుని... అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.