మొహర్రం సమీపిస్తున్న తరుణంలో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తిరిగి ఆంక్షలను విధించారు అధికారులు. పండగ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లో జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడతారని, ఉగ్రకార్యకలాపాలకు పాల్పడేందుకు అవకాశం ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనగర్ లాల్ చౌక్ చుట్టు పక్కల ప్రాంతాలను పూర్తిగా మూసేశారు. పలు రహదారుల్లో ఇనుపకంచెలు ఏర్పాటు చేశారు. వైద్య సంబంధిత అత్యవసరం ఉన్న వాళ్లను మాత్రమే బారికేడ్లు దాటి అవతలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు.