తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దిల్లీలో దోస్తీ అని కేరళలో కుస్తీకొస్తారా?"

కేరళ వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీచేయడాన్ని ఆ రాష్ట్రంలోని అధికార పక్షం తప్పుబట్టింది. ఈ నిర్ణయం పొత్తు ధర్మానికి విరుద్ధమని సీపీఎం ఆక్షేపించింది. రాహుల్​ను ఓడించి తీరతామని ప్రతినబూనింది.

By

Published : Mar 31, 2019, 2:08 PM IST

"దిల్లీలో దోస్తీ అని కేరళలో కుస్తీకొస్తారా?"

కేరళ వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గంలో రాహుల్​గాంధీ పోటీ చేస్తే ఆయన్ను ఓడించి తీరతామని సీపీఎం తేల్చిచెప్పింది. కాంగ్రెస్​ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్​ విజయన్​ తప్పుబట్టారు. వామపక్ష అభ్యర్థిపై కాకుండా భాజపా పోటీ చేస్తున్న స్థానం నుంచి రాహుల్​ బరిలోకి దిగాల్సిందని అభిప్రాయపడ్డారు. రాహుల్​ పోటీ చేస్తున్నంత మాత్రాన వయ​నాడ్​ ప్రత్యేకమేమీ కాదని, రాష్ట్రంలోని 20 లోక్​సభ స్థానాల్లానే పరిగణిస్తామని స్పష్టం చేశారు విజయన్.

రాహుల్​ నిర్ణయంపై సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్​ కారాట్​ అభ్యంతరం వ్యక్తంచేశారు.

రాహుల్​ నిర్ణయంపై సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్​ కారాట్​ అభ్యంతరం వ్యక్తంచేశారు

"వయ​నాడ్​ నుంచి రాహుల్​గాంధీ లోక్​సభ ఎన్నికల బరిలోకి దిగాలన్న కాంగ్రెస్​ పార్టీ నిర్ణయంతో... కేరళలో వామపక్షాలపై పోటీచేయాలన్నదే వారి ప్రస్తుత ప్రాధాన్యాంశంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలన్న కాంగ్రెస్ జాతీయ నిబద్ధతకు విరుద్ధం. ఎందుకంటే కేరళలో భాజపాపై ప్రధానంగా పోరాడుతోంది వామపక్ష కూటమే. కానీ రాహుల్​గాంధీ లాంటి అభ్యర్థిని వామపక్ష కూటమిపై పోటీకి దింపడం... కాంగ్రెస్​పార్టీ కేరళలో వామపక్షాలను లక్ష్యంగా చేసుకోవడమే."
- ప్రకాశ్​ కారాట్​, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి

జాతీయస్థాయిలో కాంగ్రెస్​, వామపక్షాలు మహాకూటమిలో భాగస్వాములు. కేరళలో మాత్రం సీపీఎం అభ్యర్థిపై రాహుల్​కు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.

బంగాల్​లోనూ ఇలాంటి పరిస్థితే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ మిత్రపక్షాలైనా... బంగాల్​లో మాత్రం ప్రత్యర్థులు.

ABOUT THE AUTHOR

...view details