తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 9:16 AM IST

Updated : Sep 23, 2020, 10:07 AM IST

ETV Bharat / bharat

దేశంలో 90వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 83,347 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,085 మరణాలు నమోదయ్యాయి.

COVID-19 SINGLE DAY SPIKE OF 83,347 NEW POSITIVE CASES AND 1,085 DEATHS REPORTED IN INDIA, IN LAST 24 HOURS
కొవిడ్ విధ్వంసం: దేశంలో 90వేలు దాటిన మరణాలు

దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మరో 83,347 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. బాధితుల సంఖ్య 56లక్షల 45వేల 10కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,085 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 90వేల 20కి చేరింది.

దేశవ్యాప్తంగా మంగళవారం 9,53,683 నమూనాలు పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లిండించింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 6.62 కోట్లు దాటింది. రోజూవారీ టెస్ట్​ల సామర్థ్యం 12లక్షలు దాటిందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

రికవరీ రేటు ఇలా...

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 81.25 శాతంగా ఉంది. మరణాలు రేటు మరింత ఊరట కలిగిస్తూ 1.59 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి:'కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ'

Last Updated : Sep 23, 2020, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details