తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2020, 7:46 AM IST

ETV Bharat / bharat

చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

దేశంలో లాక్​డౌన్​ కారణంగా కేంద్ర మంత్రిమండలి సమావేశం సోమవారం.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించనున్నారు. ఈ విధంగా భేటీ కావడం చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.

COVID-19: PM Modi to chair council of ministers' meet on Monday, cabinet meeting on Tuesday
చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా ఎక్కడివాళ్ళక్కడే ఉంటున్నారు. గడప దాటేందుకు కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షత వహించనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించనున్నారు.

ఈ విధంగా భేటీ కావడం చరిత్రలోనే తొలిసారి. మంగళవారం కేబినెట్​ భేటీ కూడా వీడియో కాన్ఫెరన్స్​ ద్వారానే జరగనుంది.

మార్చి 24న ప్రధాని 21 రోజుల లాక్​డౌన్​ ప్రకటించిన తర్వాత.. తొలిసారి మంత్రులంతా సమావేశం కానున్నారు. దేశంలో కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details