తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాకూ వేసవి సెలవులు కావాలి : సుప్రీంకోర్టు న్యాయవాదులు

కరోనా వైరస్​ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో తమకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది న్యాయాదుల సమాఖ్య. మార్చి 23 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ఇవ్వాలని కోరనున్నట్లు పేర్కొంది.

By

Published : Mar 21, 2020, 9:29 PM IST

Coronavirus: SC lawyer bodies appeal to CJI to declare holidays for 2-4 weeks
'న్యాయవాదులకు నాలుగు వారాలు సెలవులు ఇవ్వాలి'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డెకు సిఫార్సు చేయాలని నిర్ణయించింది న్యాయవాదుల సమాఖ్య. శనివారం జరిగిన సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్సీబీఏ) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23 నుంచి నాలుగు వారాల పాటు సెలవులను ప్రకటించాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సూచనల మేరకు ఈ సెలవులను కోరినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే పరిస్థితిని పరిశీలించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈసీ నిర్ణయించినట్లు తెలిపారు. సేవలను అందించడానికి ఏ సమయంలోనైనా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ఈసీ తీర్మానించింది.

మాకూ కావాలి..

తమకు కూడా కనీసం రెండు వారాల పాటు సెలవులను ఇవ్వాలని సీజేఐకు సిఫార్సు చేసేందుకు సిద్ధమయ్యారు సుప్రీంకోర్టు అడ్వకేట్​ ​ఆన్ రికార్డ్​ అసోసియేషన్(ఎస్​సీఎఓఆర్​ఏ)​ సభ్యులు. సాధారణంగా మే 18 నుంచి జులై 5 వరకు వేసవి సెలవులను ఇస్తారు. అయితే కరోనా నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే కోరుతున్నారు న్యాయవాదులు.

సెలవుల ప్రతిపాదనను సుప్రీం అగీకరించేందుకు అభ్యంతరాలుంటే.. తమ వద్ద కొన్ని సూచనలున్నట్లు ఎస్​సీఏఓఆర్​ఏ పేర్కొంది. డెత్​ వారెంట్లు, బెయిల్​, కస్టడీ, హెబియస్​ కార్పస్​ వంటి పిటిషన్లు మినహా.. ఇతర వ్యాజ్యాల దాఖలు పూర్తిగా నిలిపేయాలని న్యాయవాదుల సమాఖ్య సూచించింది.

ABOUT THE AUTHOR

...view details