తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఒక్కరోజే 3900 కేసులు.. 195 మరణాలు

By

Published : May 5, 2020, 9:01 AM IST

Updated : May 5, 2020, 9:34 AM IST

corona-death-toll-rises-to-1568-in-india
భారత్​లో 1568కి పెరిగిన మరణాలు

09:29 May 05

దేశంలో కరోనా కేసుల వివరాలు

ఒక్కరోజులో రికార్డు స్థాయి కేసులు...

భారత్​లో ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల వ్యవధిలో దేశంలో 3900 మంది కరోనా బారినపడ్డారు. మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో ఇప్పటివరకు ఇదే అత్యధిక పెరుగుదల అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  

దేశంలో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో 583 మంది బలయ్యారు. కేసులు 14 వేల 541కి చేరాయి.  

గుజరాత్​లో 319, మధ్యప్రదేశ్​లో 165, బంగాల్​లో 133 మంది మరణించారు.  

ఆంధ్రప్రదేశ్​లో 1650 మందికి వైరస్​ సోకగా.. 36 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణలో ఇప్పటివరకు 1085 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి.  

08:58 May 05

భారత్​లో 1568కి పెరిగిన మరణాలు

భారత్​లో కరోనా తీవ్రరూపం దాల్చింది. కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3900 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      : 46433 
  • యాక్టివ్ కేసులు      : 32138
  • మరణాలు            : 1568  
  • కోలుకున్నవారు     : 12726
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 5, 2020, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details