తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 5:31 PM IST

ETV Bharat / bharat

వరదలో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు

ఛత్తీస్​గఢ్​లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల.. 30మంది జవాన్​లతో కూడిన బస్సు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Close shave for 30 jawans as bus skids off flooded road near Bijapur, Chhattisgarh
ఛత్తీస్​గఢ్​ వరదల్లో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు

ఛత్తీస్​గఢ్​లో జవాన్లతో వెళ్తున్న బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మల్కన్​గిరి సరిహద్దు ప్రాంతం- ఒడిశాలోని బీజాపూర్​ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అదే మార్గం గుండా ఆర్మీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే.. ప్రమాద సమయంలో 30 మంది జవాన్లు అందులో ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

వరదల్లో చిక్కుకుపోయిన బస్సు

డిస్ట్రిక్ట్​ రిజర్వ్​డ్​ గ్రూప్​(డీఆర్​జీ) జవాన్లు.. నక్సల్స్​ ఆపరేషన్​ నిర్వహించి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

జవాన్​లను రక్షిస్తున్న అధికారులు
వరదల్లో కొట్టుకుపోతున్న బస్సు

ఇదీ చదవండి:కొవిడ్​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details