తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 5:55 AM IST

Updated : Dec 13, 2019, 10:12 AM IST

ETV Bharat / bharat

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారింది. బిల్లుకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

Citizenship (Amendment) Bill gets President's assent, becomes Act
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

పార్లమెంట్​ ఉభయ సభల ఆమోదముద్ర పడిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

పౌరసత్వ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​ల నుంచి మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. 2014 డిసెంబర్​ 31కి ముందు దేశంలోకి వచ్చిన వారికి ఈ అవకాశం లభిస్తుంది.

లోక్​సభలో సోమవారం ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి

Last Updated : Dec 13, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details