తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 11:14 AM IST

Updated : Jul 7, 2020, 12:12 PM IST

ETV Bharat / bharat

సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ

భారత్​- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. కశ్మీర్​, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని ఎయిర్​బేస్​ల్లో మిగ్- 17, ఏఎన్-23, మిగ్-29 యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్ శ్రేణికి చెందిన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకే వైమానిక సన్నద్ధతను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది వాయుసేన.

china
సరిహద్దులో భద్రత పటిష్ఠం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మళ్లినప్పటికీ భారత్ అప్రమత్తతను కొనసాగిస్తోంది. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా పొరుగుదేశ బలగాలు, సాయుధ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైమానికదళం సైతం గస్తీని చేపడుతోంది. గస్తీ హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు చైనా సరిహద్దుకు సమీపంలోని ఎయిర్​బేస్​ల నుంచి గస్తీ నిర్వహిస్తున్నాయి.

సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

"ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకే రాత్రివేళ గస్తీని చేపడుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించగలిగే సుశిక్షితులు, అంకిత భావం ఉన్న ఉద్యోగులను వైమానిక దళం కలిగి ఉంది. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం."

- ఏ. రత్తి, సీనియర్ యుద్ధ విమాన పైలట్

అపాచీ హెలికాప్టర్

వైమానిక దళానికి చెందిన అపాచీ, చినూక్ పోరాట హెలికాప్టర్లు, మిగ్- 17, మిగ్- 29, ఏఎన్-23 యుద్ధ విమానాలు కశ్మీర్​, ఉత్తరాఖండ్​ల్లోని ఎయిర్‌ బేస్‌ల నుంచి రాత్రివేళ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా రాత్రి వేళ కూడా తిప్పికొట్టేందుకే ఈ సన్నాహాలు చేపట్టినట్లు సమాచారం.

హెలికాప్టర్​ను సిద్దం చేస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి: బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

Last Updated : Jul 7, 2020, 12:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details