తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పనస చెట్టు రక్షణకు సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లు

సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లను.... సాధారణంగా బ్యాంకులు, ఇతర కీలకమైన ప్రదేశాల్లో భద్రత కోసం అమర్చుతారు. కానీ... కర్ణాటకలోని ఓ రైతు మాత్రం చెట్టు కోసం ఏర్పాటు చేశాడు. ఎందుకలా...? ఆ చెట్టు గొప్పతనం ఏంటి?

By

Published : Sep 17, 2019, 5:52 AM IST

Updated : Sep 30, 2019, 10:05 PM IST

పనస చెట్టు రక్షణకు సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లు

పనస చెట్టు రక్షణకు సీసీటీవీ కెమెరాలు, సెన్సార్లు
పనస పళ్లకు కర్ణాటకలోని తుముకూరు జిల్లా చాలా ప్రసిద్ధి. అందులోనూ పరమేశ్​ పొలంలో ఉండే చెట్లు మరింత ప్రత్యేకం. అరుదైనవి కూడా. అందుకే అత్యాధునిక సాంకేతికత సాయంతో వాటికి భద్రత ఏర్పాటు చేశారాయన.

పరమేశ్​ది... గుబ్బి తాలూకా సిగ్గెనహళ్లి గ్రామం.​ సుమారు 20 ఎకరాల్లో పనస, కొబ్బరి, మామిడి పంట సాగు చేస్తున్నారు. 2017లో ఆయన తోటలో అరుదుగా లభించే పనస మొక్కను గుర్తించింది భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ-ఐఐహెచ్​ఆర్​. ఈ మొక్కలకు కేరళ, ఆంధ్రప్రదేశ్​, దిల్లీ, తమిళనాడులో మంచి డిమాండ్​ ఉంది. 2020 వరకు దేశవ్యాప్తంగా ఏటా 25వేలు చొప్పున లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఐఐహెచ్​ఆర్​ అధికారులు. ఇందుకోసం పరమేశ్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మొక్కలు సరఫరా చేసినందుకు రూ.5లక్షలు చెల్లించారు.

ఈ అరుదైన చెట్టును, నాటేందుకు సిద్ధంగా ఉన్న పనస మొక్కలను కాపాడేందుకు పరమేశ్​ సాహసం చేయాల్సి వస్తోంది. వేల రూపాయలు ఖర్చు చేసి తోటలోని పనస చెట్టుకు నాలుగు దిక్కుల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెన్సార్లు బిగించాడు. తాను ఎక్కడున్నా... చెట్టు పరిసరాల్లో ఏం జరుగుతుందో మొబైల్​ ఫోన్​లో చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు రానున్న రోజుల్లో కాపలాదారుడిని పెట్టాలని భావిస్తున్నారు​ పరమేశ్​.

ఎందుకింత ప్రత్యేకం...?

ఈ పనస చెట్టును 37 ఏళ్ల క్రితం పరమేశ్​ తండ్రి నాటారు. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలో రైతు తనంతటతానే అభివృద్ధి చేసిన తొలి జాతిగా ప్రసిద్ధి చెందింది.

ఈ పనస చెట్టు కాసే కాయలు... రాగి రంగులో ఉంటాయి. లైకోపినైడ్, కెరొటెనైడ్, ఫ్లేవొనైడ్, యాంటీ ఆక్సిడెంట్స్​ కలిగి ఉండే ఈ పనస పళ్లు... మనిషి శరీరంలో కణాల పునరాభివృద్ధికి ఉపకరిస్తాయని చెబుతారు.

ఇదీ చూడండి: రూ.లక్షన్నర బంగారం మింగిన ఎద్దుకు ఆపరేషన్​

Last Updated : Sep 30, 2019, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details