తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ కేసు నిందితుల వాంగ్మూలం నమోదుకు ఆదేశం

బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులు.. తమ వాంగ్మూలాలను సమర్పించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. తాము నిరపరాధులమని నిరూపించుకునేందుకు నిందితులకు మరో అవకాశమిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

By

Published : May 28, 2020, 7:44 PM IST

CBI court to record statements of Babri mosque demolition accused from June 4
బాబ్రీ మసీదు కేసులో జూన్​ 4 నుంచి నిందితుల వాంగ్మూలాలు

బాబ్రీ ఘటన కేసు విచారణ జూన్​ 4 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి తదితరుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్​కే యాదవ్‌.. బాబ్రీ కేసు విచారణ చేపట్టనున్నారు.

క్రిమినల్‌ పీనల్‌ కోడ్‌ 313 ప్రకారం నిందితుల వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో తాము నిరపరాధులమని చెప్పుకునేందుకు నిందితులకు ఇదో అవకాశమని తెలిపారు. ప్రాసిక్యూషన్‌ సేకరించిన ఆధారాల గురించి కూడా నిందితులకు వివరిస్తామని లఖ్‌నవూ సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది.

ఇదీ చదవండి:'బాబ్రీ' కేసు తీర్పునకు 3నెలల గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details