తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంచం ఆరోపణలతో.. 'సోమా' ఉపాధ్యక్షుడి అరెస్టు

సీబీఐ ఉన్నతాధికారికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో సోమా ఎంటర్​ప్రెజస్​ ఉపాధ్యక్షుడు పీఆర్​ రావును శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఈ వ్యవహారంలో ఇంతకుముందే హోం శాఖ ఉద్యోగి ధీరజ్​, సోమా ఉద్యోగి దినేశ్​ చంద్​ గుప్తలు అరెస్టు అయ్యారు.

By

Published : Sep 14, 2019, 5:25 AM IST

Updated : Sep 30, 2019, 1:14 PM IST

లంచం ఆరోపణలపై... 'సోమా' ఉపాధ్యక్షుడు అరెస్టు

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డీఐజీకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణపై సోమా ఎంటర్​ప్రైజస్​ ఉపాధ్యక్షుడు పి.ఆర్​.రావును శుక్రవారం ఆ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఇదే వ్యవహారంలో గురువారం కేంద్ర హోంశాఖ ఉద్యోగి ధీరజ్​ సింగ్​, సోమా సంస్థ ఉద్యోగి దినేశ్​ చంద్​ గుప్తను అరెస్టు చేయగా, దానికి కొనసాగింపుగా రావును కస్టడీలోకి తీసుకున్నారు.

విచారణలో ఉన్న ఓ కేసును సోమా సంస్థకు అనుకూలంగా మార్చేందుకు రూ. 2 కోట్లు ఇస్తామంటూ డీఐజీ ఆశ్రా గర్గ్​కు హోంశాఖ పోలీసు-1 డివిజన్​లో పనిచేస్తున్న ధీరజ్​ సింగ్​ ఆశచూపారు. సోమా సంస్థ ఉద్యోగి గుప్తను కూడా పరిచయం చేశారు.

దీనిపై గర్గ్​ ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకోవడానికి సీబీఐ ఉన్నతాధికారులు వ్యూహం రూపొందించారు. సీబీఐ ప్రధాన కార్యాలయం సమీపంలోని సీఎన్​జీ బంకు వద్దకు బుధవారం రాత్రి 11 గంటలకు ధీరజ్​తో వచ్చిన గుప్తా... ఇంటి వద్ద రూ. 10 లక్షలు ఉన్నాయని, వాటిని ఇస్తానని గర్గ్​కు చెప్పారు. తరువాత సంస్థ ఉపాధ్యక్షుడు రావుతో మాట్లాడించారు. ఈ సందర్భంగా జరిగిన ఫోను సంభాషణలను రికార్డు చేసిన సీబీఐ అధికారులు తదుపరి చర్యగా అరెస్టులు చేశారు.

Last Updated : Sep 30, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details