తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాశీలో 'తిరస్కరణ'పై విచారణకు నిరాకరణ

వారణాసిలో నామపత్రం తిరస్కరణపై మాజీ జవాన్​ తేజ్​ బహదూర్ యాదవ్​​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తేల్చిచెప్పింది.

By

Published : May 9, 2019, 1:15 PM IST

Updated : May 9, 2019, 2:46 PM IST

కాశీలో 'తిరస్కరణ'పై విచారణకు నిరాకరణ

కాశీలో 'తిరస్కరణ'పై విచారణకు నిరాకరణ

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీకి విఫలయత్నం చేసిన మాజీ జవాన్​ తేజ్​ బహదూర్ యాదవ్​​కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నామపత్రాల తిరస్కరణపై దాఖలు చేసిన​ పిటిషన్​ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ వ్యాజ్యాన్ని విచారణ చేపట్టేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంది.

గత తీర్పులను పేర్కొంటూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎన్నికల వాజ్యాలు దాఖలు చేయొచ్చని జవాను తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ వివరించారు. ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ఎన్నికలు పూర్తయిన తరువాతే దాఖలు చేయాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది రాకేశ్​ ద్వివేది వాదించారు. ఈమేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తేజ్ బహదూర్​ యాదవ్​ పిటిషన్​ను కొట్టివేసింది.

ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా తేజ్​ బహదూర్​ నామపత్రం సమర్పించారు. ఉద్యోగ కాలంలో ఎలాంటి రాజద్రోహం, అవినీతికి పాల్పడలేదన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలని బహదూర్​ను కోరింది ఈసీ. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించనందున ఆయన నామినేషన్​ను తిరస్కరించారు రిటర్నింగ్​ అధికారి. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం గడప తొక్కారు బహదూర్​.

గతంలో సరిహద్దు భద్రతా దళ సైనికుడిగా పనిచేసిన బహదూర్​... సైనికులకు వడ్డించే ఆహారంపై ఫిర్యాదు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. ఫలితంగా 2017లో ఆయన్ను ఉద్యోగం నుంచి తప్పించారు అధికారులు.

ఇదీ చూడండి:రాజీవ్ కేసు దోషుల విడుదలపై పిటిషన్​ తిరస్కరణ

Last Updated : May 9, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details