తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖ్​నవూ ప్రేరణ కేంద్రంలో మాయావతి విగ్రహం

ఉత్తర​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి విగ్రహాలను లఖ్​నవూలోని ప్రేరణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు దళితులకు గర్వ కారణమని అనేకమార్లు మాయావతి పేర్కొన్నారు.

By

Published : Aug 13, 2020, 8:05 PM IST

BSP Chief Mayawati statue
లఖ్​నవూలో మాయవతి విగ్రహాల ఏర్పాటు

ఉత్తరప్రదేశ్​ లఖ్​నవూలోని బహుజన్​ సమాజ్​ ప్రేరణ కేంద్రంలో పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం మొదలైన ఈ వ్యవహారం ఇప్పటికీ సాగుతూనే ఉంది.

2005లో తన హయాంలో ఈ ప్రేరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నాటి ముఖ్యమంత్రి మాయావతి. విగ్రహాల వ్యవహారంపై అనేక రాజకీయాలు నడిచాయి. మాయావతిపై ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ మాయావతి మాత్రం.. ఇలాంటి విగ్రహాలతో దళితులు గర్వపడతారని అనేకమార్లు స్పష్టం చేశారు.

లఖ్​నవూలో మాయవతి విగ్రహాల ఏర్పాటు
లఖ్​నవూలో మాయవతి విగ్రహాల ఏర్పాటు
లఖ్​నవూలో మాయవతి విగ్రహాల ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details