తెలంగాణ

telangana

By

Published : May 27, 2019, 7:00 AM IST

ETV Bharat / bharat

ప్రపంచ కప్​పై మోదీ, థెరెసా మే చర్చ

ప్రధాని నరేంద్రమోదీతో జీ-20 సదస్సు, క్రికెట్​ ప్రపంచకప్​ విషయాలపై బ్రిటన్​ ప్రధాని థెరిసా మే చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు మే. ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు.

మోదీతో థెరిసా మే

మోదీతో థెరిసా మే

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి బ్రిటన్​ ప్రధాని థెరిసా మే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. ఇరు దేశాలకు సంబంధించి పలు విషయాలపై మోదీతో మే చర్చించారని బ్రిటన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

"ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనతో మాట్లాడారు థెరిసా మే. బ్రిటన్​ ఆతిథ్యమిస్తోన్న క్రికెట్​ ప్రపంచకప్​ విషయంపై చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగించాలని ఇద్దరు నేతలు ఆకాక్షించారు. జపాన్​లో జరిగే జీ-20 సదస్సులో ఈ స్ఫూర్తి కనబరచాలని నిర్ణయించారు."

-బ్రిటన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి

ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు థెరిసా మే తాజాగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మూడు రోజుల పర్యటన అనంతరం జూన్​ 7న పదవి నుంచి అధికారికంగా వైదొలగనున్నారు మే.

ఇదీ చూడండి: జూన్​ 7న బ్రిటన్​ ప్రధాని 'మే' రాజీనామా

ABOUT THE AUTHOR

...view details