తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ కోసం ప్రాణం తీసుకున్నాడు

టిక్​టాక్​ మరో ప్రాణాన్ని బలిగొంది. వైవిధ్యంగా వీడియో తీద్దామనుకొని గొంతుకు గొలుసు కట్టుకున్న బాలుడు ఊపిరాకడ మృతి చెందిన ఘటన రాజస్థాన్​లోని కోటాలో జరిగింది.

By

Published : Jun 22, 2019, 11:22 AM IST

Updated : Jun 22, 2019, 7:53 PM IST

టిక్​టాక్​ కోసం ప్రాణం తీసుకున్నాడు

టిక్​టాక్​ కోసం ప్రాణం తీసుకున్నాడు

టిక్​టాక్​లో వైవిధ్యంగా వీడియో చేసి ఫేమస్​ కావాలన్న సరదా.. పన్నెండేళ్ల బాలుడి ప్రాణాలనే తీసింది. రాజస్థాన్​లోని కోటాలో ఈ ఘటన జరిగింది. ఆరో తరగతి చదువుతున్న కౌశల్​ అనే బాలుడు వీడియో రూపొందించడం కోసం తల్లి మంగళసూత్రం, గాజులు ధరించి.. బాత్​రూంలోకి వెళ్లాడు. పెద్ద ఇనుప గొలుసును మెడకు చుట్టుకొని వీడియో తీయడం ప్రారంభించాడు. కాసేపటికి ఆ గొలుసు మెడకు గట్టిగా బిగుసుకుపోయి ఊపిరాడక మరణించాడు. లోపలికెళ్లిన పిల్లాడు ఎంతకూ బయటికి రాకపోవడం వల్ల తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. చనిపోయిన బాలుడిని చూసి బోరున విలపించారు.

Last Updated : Jun 22, 2019, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details