తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ..

నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలు, కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని అనధికార సమాచారం.

By

Published : Jul 2, 2019, 5:10 AM IST

నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ..

నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ..

బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుల ఆమోదం, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ తెలుపనున్నారని తెలుస్తోంది.

జీ-20 సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న ప్రధానికి ఈ సమావేశం వేదికగా ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని సమాచారం.

భాజపా సీనియర్ నేతలు ఎల్​కే ఆడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలు లేకుండా ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. 75 ఏళ్లు పైబడిన నేతలు పోటీ చేయకూడదన్న పార్టీ నిబంధనతో వీరిద్దరు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

భాజపా పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జూన్ 25నే జరగాల్సి ఉంది. భాజపా రాజస్థాన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్​ లాల్ సైనీ మృతితో వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details