తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2019, 10:54 PM IST

Updated : Dec 18, 2019, 6:55 AM IST

ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేకు సొంతపార్టీ వ్యతిరేకత.. విపక్షాల ధర్నా

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో అధికార పక్షం భాజపా ఎమ్మెల్యేకు బాసటగా నిలిచింది విపక్షం. ఓ విషయమై చర్చకు పట్టుబట్టిన ఎమ్మెల్యే నందకిషోర్​ గుజ్జర్​కు స్వపక్షీయుల మద్దతు లభించకపోగా విపక్ష సభ్యులు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో శాసనసభ వాయిదా పడింది.

BJP, oppn show of ‘unity' forces adjournment of UP Assembly
అధికార పక్ష ఎమ్మెల్యేకు బాసటగా విపక్షం!

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అధికార పక్ష ఎమ్మెల్యేకు విపక్షం మద్దతు పలికింది. వివాదాస్పద ఎమ్మెల్యే నందకిషోర్ గుజ్జర్ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు దురాగాతాలపై సభలో చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్​ నిరాకరించడం వల్ల గుజ్జర్​కు అనుకూలంగా విపక్ష నేతలు నిరసనకు దిగారు. చివరికి సభ వాయిదా పడింది.

ఇదీ జరిగింది...

ఘజియాబాద్​ ఎమ్మెల్యే గుజ్జర్​ సన్నిహితులు ఇటీవలే కొందరు అధికారులతో గొడవ పడి అరెస్టయ్యారు. అనంతరం సంబంధిత అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు గుజ్జర్​. ఇదే విషయాన్ని నేటి సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు భాజపా ఎమ్మెల్యే. కానీ స్పీకర్​ అందుకు అంగీకరించకపోవడం వల్ల సభలో వాతావరణం వేడెక్కింది. సమాజ్​వాద్​ పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే గుజ్జర్​కు మద్దతుగా నిలిచారు. సభలో మాట్లాడే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉందని నినాదాలు చేశారు. అయినా స్పీకర్​ మాట్లాడటానికి అనుమతినివ్వలేదు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. గుజ్జర్​ను సముదాయించేందుకు ఇతర భాజపా ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సభ పునఃప్రారంభమైనప్పటికీ సజావుగా సాగలేదు. సభ్యుల ఐక్యత వర్థిల్లాలని, రోజంతా సభను వాయిదా వేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను ఒకరోజుపాటు వాయిదా వేశారు. ఈ విధంగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల శాసనసభ వాయిదా పడటం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

గుజ్జర్​ ఇటీవలి కాలంలో అనేక మార్లు వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు(మైనర్​) ఓ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఎన్నికల అధికారులతోనూ గుజ్జర్​ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఓ ఆహారశాఖ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జర్​కు నోటీసులు జారీ చేశారు.

తనను హత్య చేయడానికి పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు గుజ్జర్​.

Last Updated : Dec 18, 2019, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details