తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, బిహార్, కర్ణాటక, రాజస్థాన్.. ఇలా కీలక రాష్ట్రాల్లో కమలం వికసించింది. ఎక్కడ చూసినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట విజయం సాధించిన కాంగ్రెస్.. నేడు ఘోరంగా దెబ్బతింది. కర్ణాటకలో కాంగ్రెస్​ జేడీఎస్​ కూటమి ఎదురీదుతోంది. దిల్లీలో ఆమ్​ఆద్మీని దీటుగా ఎదుర్కొంది కమలం. బంగాల్​లోనూ కాషాయపార్టీ సత్తా చాటుతోంది.

By

Published : May 23, 2019, 11:35 AM IST

కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా

2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో కమలం సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో విజయ బావుటా ఎగురువేసింది కాంగ్రెస్. అయితే ఏడాదికే అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మూడు చోట్ల అధికార కాంగ్రెస్​ను కాదని ప్రజలు కమలానికి జై కొట్టారు.

దిల్లీలో కాషాయం...

దిల్లీలో ఆమ్​ఆద్మీని భాజపా దీటుగా ఎదుర్కొంది. దేశ రాజధానిలో పాగా వేయాలన్న కమలం కల నెరవేరింది. దిల్లీలో కాషాయ పార్టీ దూసుకుపోతోంది.

బంగాల్​లో అడుగు...

ఎన్నో ఏళ్లుగా బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ హవా నడుస్తోంది. అక్కడ దీదీని ఎదుర్కొని అడుగుపెట్టాలని భాజపా ఎప్పటినుంచో విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా బంగాల్​లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక్కడ కాలు మోపాలన్న భాజపా ఆశలు నెరవేరాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​కు ఇక్కడ గండి పడింది.

బిహార్​...

బిహార్​లో ఆర్​జేడీ, కాంగ్రెస్​ కూటమి ఎన్​డీఏకు గట్టిపోటీ ఇస్తుందని అంతా భావించారు. అయితే ఇక్కడ జేడీయూ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభంజనమే పైచేయి సాధించింది. ఇక్కడ కూటమి పాచికలు పారలేదు.

కర్ణాటకలోనూ కమలమే...

కర్ణాటకలో కమలాన్ని అధికారంలోకి రాకుండా చేయడంలో కాంగ్రెస్ సఫలమైంది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కథ తారుమారైంది. జేడీఎస్​- కాంగ్రెస్ కూటమిపై భాజపా పైచేయి సాధించింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​ఘడ్​...

ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ ఏడాదికే చతికిలపడింది. ఇక్కడ కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

ABOUT THE AUTHOR

...view details