తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2019, 5:08 AM IST

ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​తో ప్రజలను భాజపా మోసం చేస్తోంది'

ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లతో దేశ ప్రజలను భాజపా మోసం చేస్తోందని ఆరోపించింది కాంగ్రెస్​. ఆ రెండు విషయాల్లో ప్రధాని.. ఆయన మంత్రులు ఒకరికొకరు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రతినిధి సుర్జేవాలా.

BJP fooling people on NRC, NPR: Cong
రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.

జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​)ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు ఈ అంశంలో ఒకరినొకరు విభేదిస్తూ.. దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించింది.

ఎన్​ఆర్​సీకి, ఎన్​పీఆర్​కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఎన్​పీఆర్​ సమాచారాన్ని ఎన్​ఆర్​సీకి వినియోగిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ పేర్కొనటంపై ఈ మేరకు స్పందించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఓ వార్తా పత్రికలో వచ్చిన ప్రతిని జోడిస్తూ ట్వీట్​ చేశారు.

రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.

" భారతదేశ ప్రజలను మోసం చేసే క్రమం ఇది.. 1. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై హోంమంత్రి ప్రకటన. 2. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై భాజపా ప్రభుత్వం తొమ్మిది కార్యక్రమాల్లో వెల్లడి. 3. హోంమంత్రి ప్రకటనను విభేదిస్తూ.. ఎన్ఆర్​సీ లేదన్న ప్రధాని. 4. ఎన్​పీఆర్​కు, ఎన్​ఆర్​సీకి ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి వివరణ. 5. ప్రధాని, హోంమంత్రి వ్యాఖ్యలతో విభేదిస్తూ.. ఎన్​పీఆర్​ సమాచారాన్ని ఎన్​ఆర్​సీకి వినియోగిస్తామని న్యాయశాఖ మంత్రి వెల్లడి. "

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.

ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details