తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2020, 2:52 PM IST

ETV Bharat / bharat

బిహార్​ వరదల్లో 19కి చేరిన మృతులు

బిహార్​లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. మరో 63 లక్షలమందికిపైగా ప్రభావితమయ్యారు. నిరాశ్రయుల్ని శిబిరాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Bihar flood toll goes up to 19, over 63.60 lakh affected
వరద శోకం: 19కి చేరిన మృతులు.. 63 లక్షలమందిపై ప్రభావం

బిహార్​లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 63.60 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. ఒక్కరోజులోనే 16 జిల్లాల్లో సుమారు 7 లక్షల మందిపై ప్రభావం చూపాయంటే.. ప్రవాహ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వర్షాల కారణంగా ఎత్తయిన ప్రాంతాలు కూడా నీట మునిగాయి.

రక్షణ చర్యలు ముమ్మరం..

బాధితులకోసం సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు సుమారు 4.40 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బాధితులందరికీ ఆహారం అందించారు.

ఇదీ చదవండి:ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details