తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' జ్వాల: జామా మసీదు ఎదుట భీమ్​ ఆర్మీ ఆందోళనలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామా మసీదు వద్ద భీమ్​ ఆర్మీ నిరసనలు చేపట్టింది. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మసీదు నుంచి జంతర్​ మంతర్​ వరకూ ర్యాలీ చేయాలని నిర్ణయించగా పోలీసులు అనుమతి నిరాకరించారు.

By

Published : Dec 20, 2019, 2:05 PM IST

Bhim Army
Bhim Army

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. జామా మసీదు నుంచి జంతర్‌ మంతర్ వరకూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహించ తలపెట్టారు. జామా మసీదు వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భీమ్‌ ఆర్మీ తలపెట్టిన ఈ ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వేలాది మంది ప్రజలు జామా మసీదు వద్దకు తరలివచ్చారు.

జామా మసీదు భీమ్​ ఆర్మీ ఆందోళనలు

జామా మసీదు వద్ద పరిస్థితిని పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details