తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

బాబ్రీ కేసుపై 9 నెలల్లోగా తీర్పు వెలువరించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది సుప్రీంకోర్టు. 1992 నాటి ఈ కేసులో భాజపా నేతలు ఎల్​.కే అడ్వాణీ, ఎంఎం జోషిలపై ఆరోపణలున్నాయి.

By

Published : Jul 19, 2019, 2:14 PM IST

9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

ఆరు నెలల్లోగా బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ పూర్తి చేయాలని ప్రత్యేక న్యాయమూర్తికి స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ పూర్తి చేసి 9నెలల్లోపు తీర్పు వెల్లడించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది.

ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.కే యాదవ్ పదవీకాలం 2019 సెప్టెంబరు 30న ముగియనుంది. దీనిని పొడిగించాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయంపై నాలుగు వారాల్లో ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేవలం బాబ్రీ కేసు విచారణ నిమిత్తమే జస్టిస్​ యాదవ్​ పదవీకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది సుప్రీం. ఈ కేసు విచారణ పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని సోమవారం సుప్రీంను ఆశ్రయించారు జస్టిస్ యాదవ్.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా సీనియర్ నేతలు ఎల్​.కే అడ్వాణీ, ఎం.ఎం.జోషీ, ఉమాభారతిలపై ఆరోపణలున్నాయి. వీరితో పాటు కమలం పార్టీ ఎంపీ వినయ్​ కతియార్, సాధ్వి రితంబరలపై 2017 ఏప్రిల్ 19న అభియోగాలు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి:- 'ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. నాకొద్దీ భద్రత'

ABOUT THE AUTHOR

...view details