ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన జరిగాక కశ్మీర్ లోయలో పర్యటించిన డోభాల్.. షోపియాన్ జిల్లాలోని రోడ్లపై సాధారణ జనంతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ఆయన పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. 'డబ్బులిచ్చి ఎవరినైనా తెచ్చుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
క్షమాపణలకు డిమాండ్..
కాంగ్రెస్ నేత ఆజాద్పై ఎదురుదాడికి దిగింది భాజపా. డోభాల్ కశ్మీర్ పర్యటనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆజాద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు భాజపా అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్.