తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దోపిడీ కోసమే ఆయుష్మాన్​"

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పథకంలో కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలకే చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తీసుకురాబోయే పథకం 'ఆయుష్మాన్'​లా ఉండదని రాహుల్​ స్పష్టం చేశారు.

By

Published : Mar 15, 2019, 3:15 PM IST

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు

ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్​ భారత్​లో కొన్ని ఆరోగ్య సమస్యలకే చికిత్స లభిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకొచ్చే ఆరోగ్య సంరక్షణ పథకం అలాంటిది కాదని రాహుల్ వెల్లడించారు.

చత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరోగ్య సంరక్షణ, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామని, ఆరోగ్య సంరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జీడీపీలో 3 శాతం నిధులను ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేస్తామని తెలిపారు.

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు

"కొద్ది మంది మాత్రమే పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టుకునేందుకు పనికొచ్చే పథకాలను మేం నడవనివ్వం. ఆయుష్మాన్​ భారత్ పథకం అలాంటిదే. ఇది కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలకే పరిమితమైంది. దేశంలోని 15-20 మంది సంపన్న వ్యాపారవేత్తలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉంది. మేం అమలు చేయబోయే పథకం అలాంటిది కాదు." - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

భారత్​ గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థకు భారీ స్థాయిలో మారుతోందని, ఇది బాధాకరంమైన విషయమైని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్​. 2019లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్యపై నిధులను పెంచనుందని తెలిపారు.

21వ శతాబ్దంలో భారతీయ పౌరుల ఆరోగ్య సంరక్షణపై ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పనులు మూడు ఉన్నాయని తెలిపారు రాహుల్​. అవి

1. నిరుద్యోగ సమస్యను అధిగమించాలి.

2. తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యను అందించాలి.

3. ఆరోగ్య సంరక్షణపై భరోసా కల్పించాలి.

ABOUT THE AUTHOR

...view details